తిరుమలలో భక్తుల రద్దీ అధికం
Published on: Mon May 15, 2023 7:27AM
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం (మే 14) తిరుమల స్వామి వారిని 87 వేల 22 మంది భక్తులు దర్శించుకున్నారు.
36 వేల 187 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 3, కోట్ల40లక్షల రూపాయలు. ఈ ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్ మెంట్లలో ఎదురు చూస్తున్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.


