తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

posted on: Oct 16, 2025 9:10AM

కలియుగ ప్రత్యక్ష  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలడుతుంటుంది. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పొటెత్తుతుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో గురువారం (అక్టోబర్ 16) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడుగంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక బుధవారం (అక్టోబర్ 15) శ్రీవారిని మొత్తం 75 వేల 919 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 218 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 79 లక్షల రూపాయలు వచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...