తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

posted on: Oct 7, 2025 9:18AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు.

మంగళవారం (అక్టోబర్ 7) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్  గంగమ్మ ఆలయం వరకూ సాగింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.  300 రూపాయల  ప్రత్యేక దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 76 వేల 733 మంది దర్శించుకున్ు. వారిలో 29,100 మంది భక్తులు  తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  రూ.4.16 కోట్లు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...