తిరుమలలో కొనసాగుతున్నభక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. బుధవారం ( జూన్ 4) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 78 వేల531 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 241 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 29 లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu