శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు
Published on: Wed Dec 25, 2024 8:12AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (డిసెంబర్ 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (డిసెంబర్ 24) శ్రీవారిని మొత్తం 67 వేల 209 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 708 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.


