తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Mon Nov 25, 2024 8:42AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంద. సోమవారం (నవంబర్ 25) శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక ఆదివారం స్వామివారిని 75 వేల 737 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల898 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది.


