Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
posted on: Nov 8, 2024 8:38AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపించడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (నవంబర్ 8) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ గోగర్భం డ్యాం సర్కిల్ వరకూ సాగాంది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (నవంబంర్ 7) శ్రీవారిని మొత్తం 52 వేల 643 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 527 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షలు వచ్చింది.






