Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: Oct 9, 2024 9:41AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. దసరా సెలవులు, శ్రీవారి బ్రహ్మాత్సవాల కారణంగా వారం మధ్యలో కూడా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం(అక్టోబర్ 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ టీబీసీ వెలుపలి వరకూ సాగింది.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా మంగళవారం (అక్టోబర్ 8) శ్రీవారిని మొత్తం 82 వేల 043 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చింది.






