శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4 కోట్ల 43లక్షలు

posted on: Mar 13, 2024 9:25AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మార్చి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని  భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం (మార్చి12) శ్రీవారిని మొత్తం 60వేల 110 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 21 వేల 445 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 43లక్షల రూపాయలు వచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...