శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు

posted on: Jan 23, 2024 7:58AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (జనవరి 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం (జనవరి 22)శ్రీవారిని మొత్తం 67 వేల 568 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 22 వేల 84 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 58లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...