Latest News
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: Aug 17, 2025 9:22AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఆగస్టు 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (ఆగస్టు 16) శ్రీవారిని మొత్తం 87 వేల 759 మంది దర్శించుకున్నారు. వారిలో 42 వేల 43 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 16 లక్షల రూపాయలు వచ్చింది.






