తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

posted on: Jun 15, 2025 10:13AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ఆదివారం (జూన్ 15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ సేవా సదన్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని మొత్తం 91 వేల 730 మంది దర్శించుకున్నారు. వారిలో 44 వేల 678 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...