తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

posted on: Oct 12, 2025 10:27AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. ఆదివారం (అక్టోబర్ 12) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పడుతోంది. ఇక శనివారం (అక్టోబర్ 11) శ్రీవారిని మొత్తం 84,571 మంది దర్శించుకున్నారు. వారిలో 36,711 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70  లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...