Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సరి-బేసి విధానం నుండి మాకు మినహాయింపు కావాలి.. ఎంపీలు
posted on: Apr 25, 2016 5:47PM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నంగా సరి-బేసి విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల సామాన్య ప్రజల నుండి రాజకీయ నేతల వరకూ జరిమానాలు కట్టవలసి వస్తుంది. తాజాగా ఓ ఎంపీ గారు కావాలనే నిబంధన ఉల్లంఘించి రెండు వేల రూపాయలు జరిమానా కట్టారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో అమలులో ఉన్న సరి-బేసి సంఖ్య విధానం నుంచి తమకు మినహాయింపు నివ్వాలంటూ ఎంపీలందరూ ఒక్కటై డిమాండు చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎంపీలు ఈ రకమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. సరి-బేసి విధానం వల్ల పార్లమెంట్ కు ట్యాక్సీల్లో రావాలంటే కుదరదని.. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ కూడా మాట్లాడుతూ.. విధానం కారణంగా సమావేశాలకు హాజరవ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మరి ఎంపీలకు సరి-బేసి విధానం నుండి మినహా ఇస్తారో లేదో చూడాలి.






