Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీలో దారుణం... తల్లీ, ఇద్దరు కూతుళ్ల గొంతు కోసి హత్య
posted on: Jun 6, 2016 12:41PM

ఢిల్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి, ఇద్దరు కూతుళ్లను దారుణంగా పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం..ఢిల్లీలోని బ్రహ్మపుర ప్రాంతంలో 50 ఏళ్ల సైరా అనే మహిళ, ఆమె కూతుళ్లు మెహరున్నీసా(19), షబ్నం (9) ముగ్గురు ఉంటున్నారు. అయితే తాళం వేసి ఉన్న వారి ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి చూడగా ముగ్గురూ రక్తపు మడుగులో పడి ఉండడం గమనించారు. దుండగులు వారి గొంతును దారుణంగా కోసేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు దుండగులు మూడు రోజుల క్రితమే వీరిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






