ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర?.. బీజేపీ ఆరోపణలు

posted on: Aug 22, 2022 1:02PM

తెలంగాణా అన‌గానే కేసీఆర్‌, బ‌తుక‌మ్మ అన‌గానే క‌విత అని యావ‌త్ తెలంగాణా ప్ర‌జ ఠ‌క్కున  గుర్తు తెచ్చుకుంటారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్థాయినుంచి కేంద్రంలో త‌న ప్రాభ‌వం చూప‌డానికి విశ్వ య‌త్నం చేస్తుండ‌గా ఊహించ‌నివిధంగా క‌విత‌క్క యావ‌త్ తెలంగాణా ప‌రువు మ‌ద్యం పాల‌సీ వ్య‌వ‌హా రం లో క‌లిపేశారు. తెలంగాణ ఒక్క‌సారిగా ఖంగారుప‌డింది.. మ‌న క‌విత‌క్క  మ‌ద్యం పాల‌సీ కుంభ కోణం లో అనుమానితురాలా.. అని. వీలు దొరికితే, చిన్న అవ‌కాశం దొరికితే తండ్రీ కుమార్తెల‌ను ఎండ‌గ‌ట్ట డానికి ఎల్ల‌పుడూ సిద్ధంగా ఉన్న బీజేపీ నాయ‌కుల‌కు ఇప్పుడో బ్ర‌హ్మాస్త్రం దొరికిన‌ట్ట‌యింది. ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణంలో ఏకంగా క‌విత భ‌ర్త త‌ర‌ఫు బంధువుల ప్రేమం ఉంద‌న్న స‌మాచారం బ‌య‌ట‌ప‌డింది. దీంతో దీని వెనుక క‌విత హ‌స్తం ఉంద‌ని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. 

ఈ మేరకు.. ఢిల్లీ (వెస్ట్‌) ఎంపీ, బీజేపీ నేత పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆదివారం(ఆగస్టు 21) ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిం దని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని   ఆరో పించారు. తెలంగాణాలో, ప‌శ్చిమ‌బెంగాల్‌లోనూ ఇలాంటి విధాన‌మే ఉండ‌డంతో బీజేపీ ఆరోపణలు బలం చేకూరినట్లైంది.   తెలంగాణాకి చెందిన ఒక వ్య‌క్తి ఢిల్లీ ఒబెరాయ్ హోట‌ల్లో ఆర్నెల్ల‌పాటు రూమ్ బుక్ చేయ‌డం, అత‌నే ఏకంగా ప్రైవేటు విమానం ఏర్పాటు చేసిన మ‌రీ కేసీఆర్ కుటుంబ‌స‌భ్యు ల‌ను ఢిల్లీకి తీసుకురావ‌డం ఏమిట‌ని బీజేపీ నేత వ‌ర్మ ప్రశ్నించారు.  అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ అరవి గోపీ కృష్ణ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఎక్సైజ్‌ అధికారులతో పాటు లిక్కర్‌ మాఫి యా, కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఆ గదిలో జరిగిన చర్చల్లోనే ఒప్పందం  కుదుర్చుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఇలాంటి విధానాన్నే పంజాబ్‌లో అమలు చేయించారనీ. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసో డియాతో కలిసి ఢిల్లీకి కూడా ఒక  ప్రణాళిక రూపొందించారనీ ఆరోపించారు. మద్యం మాఫియా కమీషన్‌ను పెంచడానికి చేసుకున్న రూ.150 కోట్ల ఒప్పందంలో తొలి విడత చెల్లింపు మనీశ్‌ సిసోడియాకు అందిం ద‌నివారు ఆరోపించారు. తెలంగాణ సీఎం కుటుంబసభ్యులను సిసోడియా కలిశారా లేదా అనే విషయాన్ని ఆయనే చెప్పాలని.. నిజాలు అంగీకరించి,   వాస్తవాలను కోర్టు ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండ‌గా, హైద‌రాబాద్ కోకాపేట‌కు చెందిన మ‌ద్యం వ్యాపారి అరుణ్ రామ‌చంద్ర పిళ్లైను ఢిల్లీకి కేసీఆర్ త‌న‌య క‌వితే తీసుకువ‌చ్చార‌ని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సింగ్‌ సిర్సా ఆరోపించారు. ఆమె ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో జ‌రిపిన స‌మావేశాల త‌ర్వాత‌నే పంజాబ్‌, తెలంగాణాలో ఉన్న మ‌ద్యం విధానాల‌ను ఆప్ నేత‌లు ఢిల్లీలోనూ అమ‌లు చేశార‌ని పేర్కొన్నారు. మద్యం వ్యాపారుల కమీషన్‌ను  12 శాతానికి పెంచడంతో పాటు, ఆక్షన్‌ లేకుండా హోల్‌సేల్‌ లైసెన్స్‌లు మంజూరు చేశారని మండిపడ్డారు. 

కాగా,  కవిత, అరుణ్‌ రామచంద్రపిళ్లైతో పాటు అరబిందో గ్రూప్‌నకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, కవిత భాగ స్వామిగా ఉన్న అనూస్‌ బ్యూటీ పార్లర్‌ డైరెక్టర్‌, ఆమె పీఏ బోయినపల్లి అభిషేక్‌, కవిత భర్త అనిల్‌ సోదరికి అల్లుడైన శరణ్‌ రెడ్డి తరచూ ఢిల్లీ వచ్చి ఈ డీల్స్‌ నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరబిందో శరత్‌చంద్రారెడ్డికి చెందిన చెందిన ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌.. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించి ఐదు చిన్న కంపెనీలకు ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌- బిడ్‌ వేసేటప్పుడు చెల్లించే సొమ్ము) చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఐదు కంపెనీల పేర్లనూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించడం గమనార్హం.

కానీ ఇంత జ‌రిగినా తెలంగాణా సీఎం కేసీఆర్ కు చీమ‌కుట్టిన‌ట్ల‌యినా లేద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నా యి. మ‌ద్యం కుంభ‌కోణంలో ఆయ‌న త‌న‌య పాత్ర‌ను దేశ‌మంతా అనుమానిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న మా త్రం మౌనం వ‌హిస్తున్నారు. కవిత డీల్‌ కుదుర్చుకున్న తర్వాతే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌ను కేసిఆర్‌ కలుసుకోవడం, పంజాబ్‌కు వెళ్లి రైతులకు డబ్బులు పంచి పెట్టడం జరిగిందని బీజేపీ నేత ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...