Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీ గ్యాంగ్ రేప్: శిక్షపై తీర్పు వాయిదా
posted on: Sep 11, 2013 3:44PM

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుపై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కేసులో దోషులకు శిక్ష ఖరారుపై సాకేత్ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అనంతరం న్యాయవాది శిక్షపై తీర్పును శుక్రవార౦ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు. దోషులపై ఏ విధమైన జాలి చూపవద్దని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దోషులకు గరిష్ట స్థాయి శిక్ష వేయాలని, వారికి మరణశిక్ష విధించడమే సరైందని అన్నారు.
దోషులను కోర్టుకు బుధవారం ఉదయంతీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా దోషులుగా తేలినవారిలో ఒకతను తాను నిర్దోషినని గట్టిగా అరిచాడు. రెండు సార్లు అతను గట్టిగా అరిచి ఆ మాట అన్నాడు. దోషులకు మరణశిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు, తమకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని నిర్భయ తండ్రి అన్నారు.



.jpg)


