Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కయ్యిమన్న కేజ్రీవాల్
posted on: May 4, 2015 4:25PM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియాపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో మీడియా సుపారీ తీసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ఆప్ ర్యాలిలో రాజస్థాన్ కు చెందిన రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అలాగే న్యాయశాఖమంత్రిగా ఉన్న జితేంద్ర తోమర్ నకిలీ డిగ్రీల వ్యవహారంపై మీడియా తమ ప్రతిష్ఠతను దిగజార్చేలా చేశారని అన్నారు. తోమర్ విషయంలో నిజనిజాలు తెలుసుకోవడం మీడియా ఉద్దేశం కాదని, అతనిని పదవి నుండి తొలగించాలనే ఉద్దేశ్యంతోనే వారు అలా ప్రచారం చేశారని విమర్శించారు. మీడియా సంస్థలపై వెంటనే బహిరంగ విచారణ జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.






