బొత్స ఇంట్లో అసమ్మతి నేతల రాగాలాపనలు

posted on: May 2, 2013 1:43PM

 

ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎన్నికల ప్రచారానికి బయలుదేరితే, ఇక్కడ హైదరాబాదులో ఆయనకి వ్యతిరేఖంగా పార్టీలో అసమ్మతి నేతలు సాక్షాత్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఆయన నివాసంలో సమావేశం అవుతున్నారు. మొదటి నుండి ముఖ్యమంత్రిని వివిధ కారణాలతో వ్యతిరేఖిస్తున్న డా. డీ.యల్. రవీంద్ర రెడ్డి, జానారెడ్డిలకు ఇప్పుడు పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్ కూడా తోడవగా, వీరికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వం వహించడం విశేషం. ఈ సమావేశానికి ప్రధాన కారణం ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన బంగారు తల్లి పధకమే! మొన్న ముఖ్యమంత్రి తన బంగారు తల్లి పధకాన్ని మెదక్ జిల్లాలో ప్రకటించి నప్పటినుండి మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. మంత్రులు జానరెడ్డి, డీ.యల్, తదితరులు మంత్రి వర్గానికి తెలియజేయకుండా, మంత్రులతో సంప్రదించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఈవిధంగా ఒంటెత్తు పోకడలు ప్రదర్శించడాన్నితప్పుపట్టారు. ముఖ్యమంత్రి తన స్వంత ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఈ విధంగా పధకాలను ప్రవేశపెడుతున్నట్లు డా. డీ.యల్ అభిప్రాయపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...