శాసనసభలో టీఆర్ఎస్ వర్సెస్ టిడిపి

posted on: Jan 24, 2014 3:13PM

 

 

 

తెలంగాణ బిల్లుపై శాసనసభలో తీవ్ర గందరగోళం మధ్య చర్చ జరుగుతోంది. సభలు పలుమార్లు టీఆర్ఎస్, టిడిపి సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. విభజన బిల్లుపై టీఆర్ఎస్ నేత జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణకు ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడే అని, టీడీపీ వైఖరి వల్లే వేలాది మంది ఆత్మహత్య చేసుకున్నానరని జోగు రామన్న ఆరోపించారు. దీనిపై సభలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. జోగురామన్న వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవకాశవాదం వల్లే తెలంగాణలో వేలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు అడుగడునా ఆదుకున్నది టీడీపీనే అని తెలియజేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...