చనిపోయాడనుకున్నారు.. కానీ

posted on: Apr 17, 2015 3:28PM

 

చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగివస్తే ఎలా ఉంటుంది. మనకెలా ఉన్నా అతని కుటుంబసభ్యులు మాత్రం ఆనందంలో మునిగితేలుతారు. అలాంటి ఆనందంలో ఉన్నారు మిడ్డిల్ లోని ఓ కుటుంబ సభ్యులు. పెంటయ్య అనే వ్యక్తి 20 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి రైలు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబసభ్యులు భావించారు. శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా చేశారు. ఇదిలా ఉండగా చనిపోయాడనుకున్న పెంటయ్య ఇటీవల తన గ్రామస్థుడికి కనిపించాడు. మొదట షాక్ కు గురైన అతను పెంటయ్య బ్రతికున్న విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలిపాడు. దీంతో పెంటయ్య కుటుంబసభ్యులు అతనిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంతకీ అంత్యక్రియలు చేసిన శవం ఎవరిదా అనే వివరాలు మాత్రం తెలియలేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...