కేసీఆర్ ని అందుకోసం కలవలేదు: డి.శ్రీనివాస్

posted on: Jul 1, 2015 12:07PM

 

సమైక్యాంధ్ర ప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన చాంబర్ లో కలిసిరావడంతో ఆయన పార్టీ మారుతారన్న వార్తలకు బలం చేకూరింది. కానీ తను అందుకోసం కేసీఆర్ ని కలవలేదని ఆయనకు జ్వరంగా ఉందని తెలిసి పరామర్శించడానికే వెళ్లానని సంజాయిషీ ఇచ్చుకొన్నారు. కానీ తమ ప్రత్యర్ధ పార్టీ అధ్యక్షుడికి జ్వరం వస్తే ఇతర పార్టీల నేతలెవరూ వెళ్లి పరామర్శించరని అందరికీ తెలుసు. కనుక ఇక ఆయన తెరాసలో చేరడం దాదాపు ఖరారు చేసినట్లే భావించవచ్చును. ఆయన ఈనెల 6వ తేదీన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతారని తాజా సమాచారం.

google-ad-img
    Related Sigment News
    • Loading...