మనిషిని మిగిన మొసలి

 

స్నానం చేయడానికి కాలువలో దిగిన ఒక వ్యక్తిని అందులో ఉన్న మొసలి మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛత్తాపూర్‌లో వున్న టైగర్ రిజర్వ్‌లో జరిగింది. దుర్జన్ యాదవ్ అనే వ్యక్తి ప్రతిరోజూ ఒక కాలువలో స్నానానికి వెళ్తూ వుంటాడు. అయితే గురువారం నాడు యాదవ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు కాలువ వద్దకు వెళ్ళి గాలింపు జరిపారు. అక్కడ లభించిన గుర్తుల ఆధారంగా దుర్జన్ యాదవ్‌ని మొసలి మింగేసిందని నిర్ధారించారు. అయితే సదరు కాలువలో మొసళ్ళు ఎక్కువగా వుంటాయని చెబుతారు. ఆ విషయం తెలిసినా ఆ కాలువలో స్నానం చేయడానికి వెళ్ళడం దుర్జన్ యాదవ్‌ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహం కోసం వెతకాలని యాదవ్ బంధువులు వేడుకుంటున్నారు. అయితే మొసళ్ళ భయంతో ఎవరూ కాలువలోకి దిగడానికి సాహసించడం లేదు.