ఫరీదాబాద్‌లో 200 బాణాసంచా దుకాణాల దగ్ధం

 

దేశ వ్యాప్తంగా బాణాసంచా ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది మరణించారు. అలాగే మచిలీపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించారు. ఇదిలా వుంటే హర్యానాలోని ఫరీదాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫరీదాబాద్‌లో బాణాసంచా అమ్మే మార్కెట్లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ మార్కెట్లో వున్న 200 బాణాసంచా దుకానాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. బాణాసంచా మార్కెట్లో ఏ దుకాణమూ మిగల్లేదు.