స్వామియే శరణం అయ్యప్పా!

posted on: Dec 11, 2012 5:18AM

 

జగన్ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో సేదతీరుతున్న మాజీమంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గత 18 సంవత్సరాలుగా అయ్యప్పమాల ధరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జైల్లో ఉన్నపటికీ మళ్ళీ అయ్యప్పమాల ధరించేరు. ఆ సంగతినే, ఆయన నాంపల్లి సి.ఐ.డి. కోర్టుకి విన్నవించుకొని ఈ నెల 24వ తేది నుండి వచ్చే నెల 2వ తేది వరకు మద్యంతర బెయిలు కావాలని కోరడంతో కోర్టు, సి.బి.ఐ.ని ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయమని చెపుతూ కేసు 13వ తేది కి వాయిదా వేసింది. స్వామియే శరణం అయ్యప్పా!

google-ad-img
    Related Sigment News
    • Loading...