Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డాక్టర్ మీద ఉమ్మేసిన కరోనా పేషేంట్, హత్యాయత్నం కేసు నమోదు
posted on: Apr 13, 2020 11:08AM
తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే ఓ రోగి ఉమ్మివేశాడు.
కరోనా లక్షణాలతో 40 ఏళ్ల వ్యక్తి ఒకరు తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. అతడు చేరినప్పటి నుంచి చికిత్సకు సహకరించకపోగా, ముఖానికున్న మాస్కును తొలగించి వైద్యులపై విసురుతూ వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా, తనకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడిపై ఉమ్మి వేశాడు. వైద్యుల ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.






