Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో 45 వేలు క్రాస్ చేసిన కరోనా కేసులు.. ఒక చిన్న ఊరట
posted on: Jul 20, 2020 9:48AM
తెలంగాణలో కొత్తగా నిన్న 1,296 పాజిటివ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటాయి. ఐతే నిన్న నమోదైన కేసులలో జీహెచ్ఎంసీలో 557 , వరంగల్ అర్బన్ 117, రంగారెడ్డిలో 111 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా తో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. దీంతో కరోనా సోకి రాష్ట్ర్రం లో మొత్తం 415 మంది చనిపోయారు. ఆదివారం ఒక్క రోజు 1831 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా మహమ్మారి నుండి కోలుకుని 32,438 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటి రికార్డుల ప్రకారం కొత్తగా వచ్చిన కేసుల కంటే కోలుకుని ఇంటికి చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఇది ఒకటే చిన్న ఊరట అని వైద్యులు తెలియ చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.






