ముగిసిన కోర్ కమిటీ భేటి
posted on Jul 19, 2013 8:06PM
ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ నివాసంలో సాయంత్రం జరిగిన కోర్ కమిటీ ముగిసింది. ప్రత్యేక తెలంగాణ సమస్యపై సిడబ్ల్యూసీ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. తెలంగాణ సమస్య పరిష్కారంపై మంతనాలు జరిపారు. రెండో ఎస్సార్సీయా లేక అఖిలపక్షమా అన్న దానిపై చర్చలు జరిపారు. అలాగే యుపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్నాథ్, అహ్మద్ పటేల్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్కూడా మహారాష్ట్రలో ఈరోజు మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు. తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయిందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు.