ఆమ్‌ఆద్మీ నుంచి పాఠాలు నేర్చుకుంటాం ; రాహుల్‌

posted on: Dec 8, 2013 6:40PM

 

నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. కాంగ్రెస్‌ విజయం కొసం అందరం చాలా కష్టపడ్డామని, షీలా దీక్షిత్‌ కూడా చాలా ప్రయత్నించారని అయినా ఓటమి తప్పలేదన్నారు. ఓటమిని సమీక్షించుకుంటామని, కాంగ్రెస్‌కు తనను తాను సంస్కరించుకునే శక్తి ఉందని, ప్రజల మద్దతు తిరిగి పొందుతామన్నారు. ఆమ్‌ఆదర్మీ పార్టీ విజయంపై మాట్లాడిన ఆయన ఆ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకోవటానికి సిద్దమని ప్రకటించారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన వారికి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...