శివమెత్తిన వీర శివారెడ్డి

 

కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కడప జిల్లా సహకార బ్యాంక్ ఎన్నికలలో తన కుమారుడిని గెలిపించుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆయన ప్రయత్నాలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గండి కొట్టడంతో ఆయన తీవ్రనిరాశకు గురయ్యారు. ఈ రోజు సహకార బ్యాంక్ అధ్యక్షపదవికి ఎన్నికలు జరుగుతునందున స్వయంగా అక్కడి పరిస్థితులను ‘పర్యవేక్షించడానికి’ వచ్చినప్పుడు కొందరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కారుపై చెప్పులు విసరడంతో వీర శివారెడ్డి కారుదిగి నడిరోడ్డు మీద వీరంగం వేసారు. దాదాపు అరగంట వరకు సాగిన ఆయన ప్రదర్శనలో వైయస్.వివేకానంద రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పీట వేసి మంత్రిపదవి అప్పగించినందునే, జగన్ పార్టీ పెట్టేంతవరకు వెళ్ళగలిగాడని, అతనికి వెనక నుండి వివేకానంద రెడ్డి మద్దతుగా నిలుస్తునందునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా సహకార ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. వీరేగాక, కడపకు చెందిన మంత్రులు డీయల్.రవీంద్ర రెడ్డి, రామచంద్రయ్యలు ఇద్దరూ కూడా పార్టీకి వ్యతిరేఖంగా పనిచేసి కడపలో పార్టీ ఓటమికి (తన కొడుకు ఓటమికి) కారకులయ్యారని ఆయన ఆరోపించారు. అందుకు కారకులయిన ఆ ముగ్గురు మంత్రుల గురించి తానూ త్వరలో కాంగ్రెస్ అధిష్టానంకు పిర్యాదు చేస్తానని హెచ్చరించారు.