పంచాయితీ ఎన్నికలలో తెదేపా, కాంగ్రెస్ హవా

 

పంచాయితీ ఎన్నికల తొలి విడతలో తెదేపా విజయడంకా మ్రోగించింది. అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. వైకాపా కూడా చాలా మంచి ఫలితాలు రాబట్ట గలిగింది. కానీ, తెరాస మాత్రం ఈ ఎన్నికలలో పూర్తిగా చతికిలపడింది. తెలంగాణా ప్రాంతంలో తనకు ఎదురులేదని భావిస్తున్న తెరాస కేవలం 207 సర్పంచ్ పదవులను మాత్రమే కైవసం చేసుకోగా, విజయమ్మ అంతంత మాత్రం ప్రచారంతోనే 68 సర్పంచ్ పదవులు దక్కించుకోవడం చూస్తే తెరాస పరిస్థితి అద్దం పడుతుంది.