బాపు మృతిపై కన్‌ఫ్యూజన్

 

ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. అయితే బాపు మరణం విషయంలో చాలా కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. బాపు ఆదివారం మధ్యాహ్నమే గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించారు. అయితే మొదట బాపు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాపు మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు బాపు కోలుకున్నారని, తమతో బాగానే మాట్లాడారని చెప్పడంతో బాపు మరణంపై పుకార్లు వ్యాపించాయన్న అభిప్రాయం కలిగింది. అయితే చివరికి బాపు మరణించినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు.