తీన్మార్ మల్లన్నపై డిజిపికి ఫిర్యాదు
posted on: Feb 4, 2025 5:16PM
ఇటీవల తీన్మార్ మల్లన్న నేతృత్వంలో వరంగల్ వేదికగా బిసీల సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలోనే తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని కుక్కలతో పోల్చినట్టు ఆరోపణలున్నాయి. మల్లన్న వ్యాఖ్యలను రెడ్డి సంఘాల నేతలు మండిపడుతున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో రెడ్డి సంఘం నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర డిజిపి జితేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. మల్లన్నపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



.webp)


