Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మన్మోహన్కి సమన్లు
posted on: Mar 11, 2015 12:44PM

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవి పోయినప్పటికీ, ఆ పదవిలో వున్నప్పుడు తగిలించుకున్న బొగ్గు మరకలు మాత్రం పోవడం లేదు. బొగ్గు కుంభకోణం విషయంలో మన్మోహన్ సింగ్ని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే. అసలే ఆ అవమాన భారంతో వున్న మన్మోహన్ సింగ్కి మరో షాక్ తగిలింది. బొగ్గు కుంభకోణం విచారణలో నిందితుడిగా వున్న ఆయన ఏప్రిల్ 8వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మన్మోహన్ సింగ్ ఈ సమన్లు అందుకున్నారు. మరి విచారణకు హాజరు అవుతారో లేదో చూడాలి. మన్మోహన్ సింగ్తోపాటు బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ ప్రకాష్, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాతోపాటు మరో ముగ్గురికి కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.



.jpg)


