Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో వివాదంలో సిద్ద రామయ్య... 1.3కోట్ల ముడుపులు..
posted on: Jun 3, 2016 4:00PM

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకున్న సిద్ద రామయ్య.. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ)కు స్టివార్డ్గా వివేకానంద అనే వ్యక్తిని సిద్దరామయ్య ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఎంపికపై సిద్దరామయ్యకు ముడుపులు అందాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎస్.భాస్కరన్ అనే సామాజిక కార్యకర్త స్టివార్డ్గా నామినేషన్ వేసిన ఎల్.వివేకానందతో సిద్ధరామయ్యకు లావాదేవీలు జరిగాయని.. స్టివార్డ్గా నామినేట్ అయిన కొద్ది రోజులకే సిద్ధరామయ్య ఆయన నుంచి రూ.1.3కోట్ల రుణం తీసుకున్నారని ఆధారాలను సంపాదించి స్పందించారు. కర్ణాటక గవర్నర్ ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని ఎస్.భాస్కరన్ కోరారు. మరోవైపు ఈ విషయమై వివేకానంద స్పందిస్తూ.. సీఎంతో ఎటువంటి లావాదేవీలు జరగలేదని, తమపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.






