ఎమ్మెల్యేకి అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్

 

పాలమూరులో కరువు తీవ్రతను వివరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరితే ఇవ్వడం లేదని అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు, మహబూబ్ నగర్ జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని, దీనిపై సీఎంకు విన్నవించాలని ప్రయత్నించానని, అయితే కేసీఆర్ కనీసం అపాయింట్ మెంటే ఇవ్వడం లేదని సంపత్ ఆరోపించారు, గత ఎన్నికల్లో ఆర్డీఎస్ ను చూపించి ఓట్లు సంపాదించుకున్న కేసీఆర్ ఇప్పుడెందుకు దాన్ని పట్టించుకోవడం లేదని సంపత్ ప్రశ్నించారు, పండగల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్... కరువుతో అల్లాడుతున్న ప్రజానీకాన్ని మాత్రం ఆదుకోవడం లేదని సంపత్ మండిపడ్డారు.