Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వామ్మో.. కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని సంఘాలా?
posted on: Sep 26, 2015 12:38PM

వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులపై జరిగిన ఎన్ కౌంటర్ పై పలు సంఘాలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎన్ కౌంటర్ పై పులువురు పలు రకాలుగా విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై విరసం నేత వరవరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ కేసీఆర్ ఆదేశాల వల్లే జరిగిందని.. ఎన్ కౌంటర్ కు కేసీఆరే బాధ్యత వహించాలని వరవరరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులు శృతి - విద్యాసాగర్ రెడ్డిల మృతికి బూటకపు ఎన్ కౌంటరే కారణమని ఆయన ఆరోపించారు. తమ కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని.. మైనింగ్ మాఫియా కోసం ప్రాజెక్టుల్లో బినామీలుగా సంపాదనకు మరిగిన అధికార పార్టీ తొత్తులే ఈ ఎన్ కౌంటర్ కు కారణమని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈనెల 30న 370 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో ఆసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వరవరరావు ప్రకటించారు.



.jpg)


