వామ్మో.. కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని సంఘాలా?

వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులపై జరిగిన ఎన్ కౌంటర్ పై పలు సంఘాలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎన్ కౌంటర్ పై పులువురు పలు రకాలుగా విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై విరసం నేత వరవరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ కేసీఆర్ ఆదేశాల వల్లే జరిగిందని.. ఎన్ కౌంటర్ కు కేసీఆరే బాధ్యత వహించాలని వరవరరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులు శృతి - విద్యాసాగర్ రెడ్డిల మృతికి బూటకపు ఎన్ కౌంటరే కారణమని ఆయన ఆరోపించారు. తమ కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని.. మైనింగ్ మాఫియా కోసం ప్రాజెక్టుల్లో బినామీలుగా సంపాదనకు మరిగిన అధికార పార్టీ తొత్తులే ఈ ఎన్ కౌంటర్ కు కారణమని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈనెల 30న 370  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో ఆసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వరవరరావు ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu