చంద్రబాబును కలిసిన రేవంత్, ఎర్రబెల్లి.. ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు

posted on: Oct 27, 2015 3:43PM


తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతలు సమావేశమవ్వగా ఇరువురి నేతల మధ్య వివాదం తలెత్తి తీవ్రమైనస్థాయిలో విమర్సించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. పార్టీ పరువు తీస్తున్నారని.. వారిని విజయవాడలో ఉన్న తనను కలవమని చెప్పగా ఈ రోజు కలిశారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరర్రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనకు ఏమాత్రం గుర్తింపు లేదని.. తనకు ఏమాత్రం సమాచారం అందిచకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. టీఆర్ఎస్ పై ఉమ్మడి పోరు సాగిద్దామన్నా తనకు ఎవరూ మద్దతు పలకడంలేదని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలస్తోంది. దీంతో చంద్రబాబు సమస్యను పెద్దదిగా చేసుకోవద్దు.. మిగిలిన నేతలతో నేను మాట్లడతానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎర్రబెల్లి మిగిలిన నాయకులు రేవంత్ రెడ్డిది ఒంటెద్దు పోకడని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ సమావేశంలోనే వరంగల్ ఉపఎన్నిక గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...