Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏడు రహదారులకు శంకుస్థాపన.. 9 నగరాలు ఉంటాయి...
posted on: Mar 29, 2017 2:34PM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో సుమారు రూ.915కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడు ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తూర్పు-పశ్చిమ దిశల్లో మూడు, ఉత్తర-దక్షిణ దిశల్లో నాలుగు రహదారులను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘ ఆంధ్రులకు అపార జ్ఞానం ఉంది. ఏపీకి చెందిన వారు అనేక దేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా తీర్చిదిద్దుతాం. రాజధానిలో 9 నగరాలు ఉంటాయి. ప్రపంచంలోనే మేటైన నగరంలో అమరావతి నిలుస్తుంది. చారిత్రక వారసత్వం ఉన్న అమరావతిని మళ్లీ రాజధానిగా ప్రకటించి కొత్త చరిత్ర నాంది పలికాం. మూడేళ్లకు ముందు ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఇక్కడే రాజధాని నిర్మించాలని వీరోచిత నిర్ణయం తీసుకున్నాం. రాజధానిని హరిత, నీలి నగరంగా తీర్చిదిద్దుతాం’ అని చంద్రబాబు అన్నారు.


.jpg)



