రాష్ట్రంలో కొత్తగా 349 బ్యాంకులు.. చంద్రబాబు

 

విజయవాడలో బ్యాంకర్ల సదస్సు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రూ. 83 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయిలు ఇవ్వాలని, విద్య కోసం 2150 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి 5536 కోట్ల రూపాయిల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కోళ్ల పరిశ్రమకు రూ.1299 కోట్లు, మత్స్య శాఖకు రూ.1713 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 349 బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు అన్నారు. ముద్రా బ్యాంకు రుణ లక్ష్యంగా రూ.25 వేల కోట్లు నిర్ణయించారు. రుణ ప్రణాళిక లక్ష్యం 1,65,538 కోట్ల రూపాయిలని, ప్రాధాన్య రంగాలకు 1,25,538 కోట్ల రూపాయిలు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు అన్నారు.