మోడీతో చంద్రబాబు భేటీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేయాల్సిందే..

posted on: May 17, 2016 12:40PM

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ ప్రత్యేక హోదా పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కేంద్ర ఏపీకి ఇచ్చిన నిధులు.. ఇవ్వాల్సిన నిధులు.. ఇతర రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన నిధులు.. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు వంటి తదితర గణణాంకాలు వేసుకొని మరీ నివేదికను తయారు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేయాల్సిందేనని ఆ వినతిపత్రంలో మోదీని చంద్రబాబు కోరారు. చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్‌ సత్య ప్రకాశ్ టక్కర్, ఉన్నతాధికారులు ఉన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...