6 వేల మంది అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

posted on: May 16, 2016 12:56PM


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 6 వేల మంది అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉపాధి హామీ పథకం కింద నిధులు రూ వేయ్యి కోట్లు ఖర్చు చేశామని.. రానున్న 45 రోజుల్లో మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపాధిహామీ పనుల్లో పురోగతి బాగుందన్నారు... పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకాలు వేగవంతం చేయాలని తెలిపారు. పంట సంజీవనిలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయని, శ్రీకాకుళం, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్‌ జలసిరి కింద 6,21,745 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...