ఇసుజు మోటార్స్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

 

నవ్యాంధ్రలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలను నెలకొల్పడానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఆసియాలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది. అది అయిపోయిందే లేదో అప్పుడే మళ్లీ ఈరోజు శ్రీసిటీకి వెళ్లి ఇసుజు మోటార్స్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.