చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష.. పోలవరం, పట్టిసీమ పై చర్చ

సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యంగా పోలవరం, పట్టిసీమ పై చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు చంద్రబాబు మాట్లాడుతూ నదుల అనుసంధానం.. నీరు - చెట్టు కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చాయని.. వచ్చే ఏడాది నాటికి రెండంకెల అభివృద్ధి సాధించాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది.