ఆ స్థోమత నాకు లేదు.. పవన్ కళ్యాణ్
Published on: Thu Nov 12, 2015 1:52PM

బీజేపీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాల్సిందే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. అంతేకాదు ప్రజలకు చెడు జరిగితే మాట్లాడటానికి తను అస్సలు వెనుకాడనని అన్నారు. ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టే స్థాయి నాకు లేదు.. కానీ పద్దతి ప్రకారమే ఏదైనా సాధించుకోవాలి అని సూచించారు. జనసేనను రాజకీయ పార్టీగా విస్తరించే స్థోమత నాకు లేదు.. 2019 నాటికి పూర్తిస్థాయిలో విస్తరించడానికి ప్రయత్నిస్తా అని అన్నారు.


