అభినందనలు తెలిపేందుకే కలిశా.. పవన్ కళ్యాణ్

posted on: Nov 12, 2015 1:29PM


ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను రాని కారణంగా.. చంద్రబాబుకు అభినందనలు తెలియజేయడానికి కలిశానని వివరించారు. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలపై చర్చించాం.. గిరిజనులు జీవితాలు దెబ్బతినకుండా చూడాలని చంద్రబాబును కోరానని చెప్పారు. అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదా పై కూడా చర్చించామని.. ప్రధాని మోడీ నుండి తుది ప్రకటన వచ్చాక స్పందిస్తామన్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలు సీఎం ముందుంచా.. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందిచారని పవన్ తెలిపారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...