చంద్రబాబును అభినందించిన రైతులు

posted on: Oct 26, 2015 5:10PM



ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని ఏపీ రైతులు చంద్రబాబుకి కితాబిచ్చారు. ఈ రోజు ఉదయం ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని అభిందించారు. అంతేకాదు రాజధాని నిర్మాణం ద్వారా రైతులకు, యువకులకు ఉపాధి కల్పించాలని రైతులు చంద్రబాబును కోరడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ ప్రజల కల రాజధాని అమరావతి అని.. రాజధానిని త్వరగా పూర్తి చేసుకుందామని రైతులకు చెప్పారు. అంతేకాదు రాజధాని అమరావతికి రైతులు భూములను స్వచ్ఛందంగానే ఇచ్చారని.. కొంతమంది కావాలనే పంటలు తగలబెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మనకు తిండి పెట్టే పంటలను తగలబెట్టే సంస్కృతి తమది కాదని అన్నారు. మొత్తానికి రైతులే స్వయంగా చంద్రబాబు అభినందించడం శుఖపరిణామమే.

google-ad-img
    Related Sigment News
    • Loading...