తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు
Published on: Wed Sep 30, 2015 3:38PM

టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం లేదని.. మాకు ఆస్తులు సంక్రమించిన సమయంలో ఉన్న విలువనే బ్యాలెన్స్ షీట్లో చూపిస్తామని అంతేకాని ఎప్పటికప్పుడు పెరిగే..తరిగే విలువలను బ్యాలెన్స్ షీట్లో ఉండదని అన్నారు. తాము ఆస్తివివరాలు తెలిపినట్టు ఇతర పార్టీలకు చిత్తశుద్ది ఉంటే వారి ఆస్తి వివరాలు కూడా ప్రకటించాలని అన్నారు. అంతేకాదు తమ ఆస్తుల గురించి వాస్తవాలు తెలియకుండా తెలివితక్కువగా మాట్లాడవద్దని చంద్రబాబు సూచించారు.


