TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేదవారి ముఖాల్లో వెలుగు చూడాలి.. చంద్రబాబు

Published on: Mon Aug 10, 2015 2:54PM

 

ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్న జిల్లా 'మీ ఇంటికి మీ భూమి' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భూమిని వారికి అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. కాగా రాష్ట్రంలో పేదవారి ముఖాల్లో వెలుగు చూడాలని.. పేదవారికి న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందడంలో దళారుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. అంతేకాక రుణమాఫీ కోసం రూ. 25 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. ఉద్యోగులకు అన్నివిధాలా మేలు చేస్తామని.. ఉద్యోగులు అవినీతి రహితంగా పనిచేయాలని సూచించారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాగా రాష్ట్రవిభజన వల్ల ఏపీ ఆర్ధికంగా బాగా దెబ్బతిందని.. దీనికి సహాయపడేందుకు కేంద్రం ఉందారంగా ముందుకు రావాలని కోరారు.