రాజమండ్రి ఘటన దురదృష్టకరం... చంద్రబాబు

posted on: Jul 16, 2015 2:58PM

 

మూడోరోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొవ్వూరు లోని గోష్పాదక్షేత్రాన్ని పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజే రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్త చేశారు. రాష్ట్రంలో పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయని.. భక్తులను అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని... భక్తులు సైతం క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మహా పుష్కరాలకు ఒక్క మన రాష్ట్ర నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...